చిత్తూరు: సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలనకు జనం జేజేలు పలుకుతున్నారు. ఇప్పటికే ప్రజల గుండెల్లో సీఎం వైయస్ జగన్ గూడు కట్టుకోగా..శ్రీకాళహస్తి లో ముఖ్యమంత్రికి ఓ దేవాలయం నిర్మించి తన అభిమానాన్ని చాటుకున్నారు వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి 2 కోట్ల రూపాయల ఖర్చుతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డికి ఓ గుడి కట్టించారు. 'నవరత్నాల నిలయం' పేరుతో నిర్మించిన ఈ ఆలయంలో జగన్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రైతు భరోసా, పింఛన్లు, ఆరోగ్యశ్రీ, అమ్మఒడి, ఫీజు రీయింబర్స్మెంట్, జలయజ్ఞం, ఇళ్ల స్థలాల పేరుతో స్తూపాలు కూడా నిర్మించారు.
భారీగా నిర్మించిన ఈ ఆలయంలో హుండీ కూడా ఏర్పాటు చేయడం విశేషం. అయితే, ఈ హుండీలో కానుకలకు బదులు సమస్యలు, విజ్ఞప్తులను సమర్పించుకోవచ్చు. ప్రసాదాలుగా ప్రభుత్వ పథకాలను తెలియజేసే కరపత్రాలు అందిస్తారు. జగనన్న నవరత్నాల నిలయాన్ని తిరుపతి పార్లమెంటు సభ్యుడు ఎం.గురుమూర్తి ప్రారంభించారు.