వైయస్ఆర్సీపీలోకి టీడీపీ ట్రేడ్ యూనియన్ నేతలు
22 Aug, 2019 15:04 IST
విజయవాడ: తెలుగు దేశం పార్టీ ట్రేడ్ యూనియన్ నేతలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో వైయస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు గౌతంరెడ్డి టీడీపీ నేతలకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో కలిసి మా సమస్యలు చెప్పామని, పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు ఎస్ఎస్ఆర్ మూర్తి తెలిపారు.