సీఎం సమక్షంలో వైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ నేత శ్రీనాథ్రెడ్డి
8 Dec, 2022 16:41 IST
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే జి.వి. శ్రీనాథ్రెడ్డి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శ్రీనాథ్రెడ్డితో పాటు పీలేరు నియోజకవర్గ టీడీపీ నేతలు జి.వి. రాకేష్ రెడ్డి, ఎం.వెంకట కృష్ణారెడ్డి, వి.ఉమాకాంత్ రెడ్డి, బి.నరేందర్ రెడ్డి, జి.నరేష్కుమార్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరారు. సీఎం వైయస్ జగన్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాజంపేట వైయస్ఆర్ సీపీ ఎంపీ పీవీ. మిధున్ రెడ్డి, పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మైనారిటీస్ కమిషన్ చైర్మన్ ఇక్భాల్ అహ్మద్ ఖాన్ పాల్గొన్నారు.