వైయస్ఆర్సీపీ సానుభూతిపరుడిపై టీడీపీ నేత దాడి
7 Jun, 2025 12:02 IST
తిరుపతి జిల్లా: రాష్ట్రంలో ఏడాది కాలం నుంచి అరాచకం రెడ్ బుక్ పాలన నడుస్తోంది. ఇప్పుడు రెడ్ బుక్ పాలన పరాకాష్టకు చేరింది. నిత్యం ఏదో చోట తెలుగుదేశం పార్టీ నేతలు దాడులకు తెగబడుతున్నారు. తాజాగా తిరుపతి జిల్లా పాకాల మండలం మద్దినాయన పల్లి పంచాయతీ ఐయ్య వారిపల్లి లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడు శంకర్ పై టీడీపీ నేతలు దాడి చేసి గాయపరిచారు. గ్రామ కంఠం, చెరువు పోరంబోకు స్థలం ను కబ్జా చేసేందుకు యత్నిస్తున్న టీడీపీ నేతలను ప్రశ్నించినందుకు శంకర్పై దాడి చేశారు. శంకర్ పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులు కు ఫిర్యాదు చేసినా పట్టించుకొని వైనం. టీడీపీ నాయకుల దాష్టీకాన్ని వైయస్ఆర్సీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు.