వైయస్‌ఆర్‌సీపీలోకి తాటిపాడు మాబుసా 

18 Mar, 2019 12:48 IST


కర్నూలు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. కర్నూలు జిల్లా నందికొట్కూరుకు చెందిన మైనారిటీ నేత తాటిపాడు మహబూబ్‌ సాహెబ్‌ వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. సోమవారం పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. కండువా కప్పి వైయస్‌ జగన్‌ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్థర్‌ నేతృత్వంలో మాబుసా పార్టీలో చేరారు.