సీఎం వైయస్ జగన్తో తమిళనాడు మంత్రుల భేటీ
4 Mar, 2020 17:02 IST
తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డితో తమిళనాడు రాష్ట్రానికి చెందిన మంత్రుల బృందం భేటీ అయ్యింది. ఈ సమావేశంలో నదుల అనుసంధానం, సాగునీటి ప్రాజెక్టులపై చర్చించినట్లు సమాచారం. సీఎం వైయస్ జగన్ను కలిసిన వారిలో తమిళనాడు మంత్రులు ఎస్పీ.వేలుమణి(మున్సిపల్ అండ్ రూరల్ డవలప్మెంట్), డి.జయకుమార్(ఫిషరీస్ అండ్ అడ్మనిస్ట్రేటివ్ రిఫార్మ్స్) తదితరులు ఉన్నారు.