అనవసరంగా మాట్లాడితే సహించేది లేదు
17 Aug, 2019 16:55 IST
తిరుపతి: ఎస్వీబీసీలో గతంలో జరిగిన అవినీతిపై విచారణ చేయిస్తామని ఎస్వీబీసీ చైర్మన్ పృధ్వీరాజ్ పేర్కొన్నారు. ఎస్వీబీసీ కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులర్ అంశంపై సీఎంతో చర్చిస్తానని చెప్పారు. సినీ పరిశ్రమలో కొందరు ప్రభుత్వంపై నిందలు వేయడం సిగ్గు చేటు అన్నారు. అనవసరంగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు.