విశాఖ: జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తన తండ్రి దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. వైయస్ఆర్ పార్కులో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించి, నివాళులర్పించారు. కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.