తాడేపల్లి: స్టేట్ ఫోకస్ పేపర్ 2022-23 ను ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్టేట్ ఫోకస్ పేపర్-2022-2023 బ్రోచన్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్ధికశాఖమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, పలువురు ఉన్నతాధికారులు, నాబార్డు ఛైర్మన్ డాక్టర్ జి.ఆర్.చింతల, వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.