కరోనా నియంత్రణ చర్యలపై సీఎం సమీక్ష ప్రారంభం
9 Apr, 2020 12:15 IST
తాడేపల్లి: కరోనా నియంత్రణ చర్యలపై సీఎం వైయస్ జగన్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్ హాజరయ్యారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ, లాక్డౌన్ కొనసాగుతున్న తీరు, క్వారంటైన్లు, ఐసోలేషన్లో కేంద్రాల్లో మౌలిక వసతులు వంటి అంశాలపై సీఎం వైయస్ జగన్ అధికారులు, మంత్రులతో చర్చిస్తున్నారు.