విశాఖ: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసి రాష్ట్రంలోని 32 లక్షల మంది గిరిజనుల కలను నెరవేర్చారని నూతన ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభా రవిబాబు పేర్కొన్నారు. ఎస్టీ కమిషన్ చైర్మన్గా కుంభా రవిబాబు శనివారం బాధ్యతలు చేపట్టారు. ఎస్టీ కమిషన్ ఏర్పాటుతో ఆదివాసీల పక్షపాతిగా సీఎం వైయస్ జగన్ నిలిచారన్నారు. సీఎం ఆలోచనకు అనుగుణంగా ఆదివాసీల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని కుంభా రవిబాబు తెలిపారు.