ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం వైయస్ జగన్ అభినందనలు
10 Feb, 2023 11:05 IST
తిరుపతి: శ్రీహరికోట నుంచి ఎస్ఎస్ఎల్వీ డీ2 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగంలో ఎస్ఎస్ఎల్వీ డీ2.. మూడు ఉప గ్రహాలను అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. దీని ద్వారా 2 దేశీయ, అమెరికాకు చెందిన ఒక ఉపగ్రహం కక్షలోకి వెళ్లనున్నాయి. ఈ ప్రయోగం విజయవంతం కావడం పట్ల ఆంధ్ర్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు.