స్పందన అప్డేషన్ పోర్టల్ ప్రారంభించిన సీఎం
26 Mar, 2021 14:50 IST
తాడేపల్లి: ప్రజా సమస్యల పరిష్కార వేదికగా వైయస్ జగన్ సర్కార్ `స్పందన` పోర్టల్ను రూపొందించింది. అప్డేషన్తో కూడిన స్పందన పోర్టల్ను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, సైన్స్ అండ్ టెక్నాలజీ కార్యదర్శి విజయకుమార్, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ నారాయణ భరత్ గుప్తా, ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్ ఏ.మల్లిఖార్జున, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.