తాడేపల్లి: కోవిడ్-19 నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న నియంత్రణ చర్యలపై సమగ్ర సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకునేందుకు ప్రత్యేకంగా యాప్ను రూపొందించారు. ఈ యాప్ను ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో శనివారం ఆవిష్కరించారు. వాట్సప్, పేస్బుక్ మెసెంజర్ చాట్ బోట్లను క్యాంపు కార్యాలయంలో సీఎం ప్రారంభించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఆళ్లనాని, హోం మంత్రి మేకతోటి సుచరిత, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.