11న వైయస్ఆర్సీపీలోకి ఏపీఐఐసీ మాజీ ఛైర్మన్ శ్రీఘాకోళపు శివరామ సుబ్రహ్మణ్యం
9 Mar, 2019 14:46 IST
సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు నేడో,రేపో వెలువడుతుందనుకుంటున్న తరుణంలో వైయస్ఆర్సీపీలోకి వలసల వెల్లువ మరింత ఊపందుకుంది.తాజాగా వైయస్ఆర్సీపీలోకి ఏపీఐఐసీ మాజీ ఛైర్మర్ శ్రీఘాకోళపు శివ సుబ్రహ్మణ్యం ప్రకటించారు.11న కాకినాడలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే సమర శంఖారావంలో ఆయన సమక్షంలో చేరబోతున్నట్లు తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా అధిక సంఖ్యలో వివిధ పార్టీలకు చెందిన నేతలు వైయస్ఆర్సీపీలోకి చేరుతున్నారు. వైయస్ఆర్సీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా సీనియర్ నేతలు దాడి వీరభద్రరావు,మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, చల్లా రామకృష్ణారెడ్డి వైయస్ జగన్ సమక్షంలో పార్టీలోకి చేరారు.