తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి కేఎస్.జవహార్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలోని తన చాంబర్లో నూతన బాధ్యతలు చేపడుతూ ఫైల్స్పై సంతకాలు చేశారు. ఈ మేరకు జవహర్రెడ్డికి పలువురు అధికారులు అభినందనలు తెలిపారు.