సీఎం వైయస్ జగన్ను కలిసిన సమీర్ శర్మ
13 Sep, 2021 15:48 IST
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డిని ఏపీ తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన డాక్టర్ సమీర్ శర్మ సీఎం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుత సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్ధానంలో తదుపరి సీఎస్గా సమీర్ శర్మ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రణాళికా మరియు రిసోర్స్ మొబలైజేషన్ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సమీర్ శర్మ విధులు నిర్వర్తిస్తున్నారు.