తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు జోరందుకున్నాయి. తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ శమంతకమణి, మాజీ ఎమ్మెల్యే యామిని బాల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో శమంతకమణి, యామినిబాల వైయస్ఆర్ సీపీలో చేరారు.