విశాఖపట్నం జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

26 Jan, 2026 12:22 IST

విశాఖపట్నం:   విశాఖపట్నం జిల్లా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా వాలంటరీ విభాగం అధ్యక్షులు పీలా ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు.  ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన విశాఖపట్నం జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు కె.కె. రాజు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మహాత్మా గాంధీ, భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్, అలాగే దివంగత ముఖ్యమంత్రి డా. వై.య‌స్. రాజశేఖరరెడ్డి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు రాజ్యాంగ విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని, ప్రజాస్వామ్య పరిరక్షణకు అందరూ కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. వైయ‌స్ఆర్‌సీపీ ఎల్లప్పుడూ సామాజిక న్యాయం, సమానత్వం కోసం పోరాడుతుందని వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు కుంబా రవిబాబు, సమన్వయకర్తలు తిప్పల దేవన్ రెడ్డి, మొల్లి అప్పారావు, అలాగే రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని గణతంత్ర దినోత్సవ వేడుకలను విజయవంతం చేశారు.