తాడేపల్లి: బోయ, వాల్మీకి కులాలకు సంబంధించిన సమస్యలపై అధ్యయనం చేసి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డికి నివేదిక (పార్ట్ 1) ను రిటైర్ట్ ఐఏఎస్ అధికారి శామ్యూల్ ఆనంద్ కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ను గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే మర్యాదపూర్వకంగా కలిశారు.