సీఎం వైయస్ జగన్ను కలిసిన నాస్కామ్ మాజీ అధ్యక్షుడు రెంటాల చంద్రశేఖర్
17 Sep, 2021 18:34 IST
తాడేపల్లి: ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్ జగన్ను నాస్కామ్ మాజీ అధ్యక్షుడు రెంటాల చంద్రశేఖర్ (రిటైర్డ్ ఐఏఎస్) మర్యాదపూర్వకంగా కలిశారు. గతంలో కేంద్ర ఐటీ శాఖ, టెలికమ్యూనికేషన్స్ కార్యదర్శిగానూ, కేంద్ర ప్రభుత్వ టెక్నాలజీ అడ్వైజర్ గ్రూప్లో సభ్యుడిగా ఆర్.చంద్రశేఖర్ పనిచేశారు. ఈ భేటీలో సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఉన్నారు.