పెనుమాక జెడ్పీ హైస్కూల్లో రాజన్న బడిబాట
14 Jun, 2019 11:00 IST
అమరావతి: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక జెడ్పీ స్కూల్లో ఏర్పాటు చేసిన రాజన్న బడి బాట కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొని ప్రారంభించారు. ముందుగా జ్యోతిప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఒకేసారి 2 వేల మంది విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాసం చేయనున్నారు.