ప్రకాశం పంతులు జీవనయానం తరతరాలకు మార్గదర్శకం

23 Aug, 2019 11:52 IST

అమరావతి:  మాజీ సీఎం ప్రకాశం పంతులుగారి జయంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. అత్యున్నత స్థాయి సేవలు అందించి తెలుగు వారి ఖ్యాతిని ఇనుమడింప చేసిన మహోన్నత నేత ప్రకాశం పంతులు గారు అని కొనియాడారు. స్ఫూర్తిదాయకమైన ప్రకాశం పంతులు గారి జీవనయానం తరతరాలకు మార్గదర్శకమని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ట్విట్టర్‌లో పేర్కొన్నారు.