మాజీ మంత్రి విడదల రజినీపై పోలీసుల దౌర్జన్యం
10 May, 2025 17:36 IST
పల్నాడు: అధికార పార్టీ నేతల అండదండలు చూసుకుని ఖాకీలు రెచ్చిపోతున్నారు. ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారు. నాదెండ్ల మండలం మానుకొండ వారి పాలెంలో ఓ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన మాజీ మంత్రి విడదల రజినీపై పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించారు. రజిని ప్రధాన అనుచరుడైన శ్రీకాంత్ను అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులు తనను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో? ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో చెప్పలేదు. అడ్డు తొలగకపోతే మీపై కూడా కేసు పెడతామంటూ సీఐ సుబ్బారాయుడు మాజీ మంత్రి రజినిని బెదిరించాడు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ఎలా అమలు అవుతుందో చెప్పడానికి ఈ రోజు జరిగిన ఘటనే సాక్ష్యం.