సీఎం వైయస్ జగన్కు ప్రధాని మోదీ ఫోన్
20 Apr, 2020 11:01 IST
తాడేపల్లి: ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ముఖ్యమంత్రి వైయస్ జగన్కు ఫోన్ చేశారు. కోవిడ్ –19 నివారణకు తీసుకుంటున్న చర్యలపై ఇద్దరూ చర్చించుకున్నారు. రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలు, అనుసరిస్తున్న వ్యూహాలను సీఎం ప్రధానికి వివరించారు. రాష్ట్రంలో వైరస్ నివారణకు, వ్యాప్తిని అడ్డుకోవడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. టెస్టింగ్ సామర్థ్యాన్ని పెంచుకున్న అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.