ప్రధాని వీడియో కాన్ఫరెన్స్లో సీఎం వైయస్ జగన్
11 Apr, 2020 12:41 IST
తాడేపల్లి: దేశంలో కరోనా వైరస్ మరింత విజృంభిస్తోన్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఈ కాన్ఫరెన్స్లో సీఎం వైయస్ జగన్ పాల్గొన్నారు. ఒకవేళ లాక్డౌన్ ఎత్తివేస్తే దేశంలో ఏ విధమైన కొత్త సమస్యలూ రాకుండా చూడాలని మోదీ సీఎంలకు సూచిస్తున్నారు. లాక్డౌన్ గడువు ఈ నెల 14తో ముగియనున్న నేపథ్యంలో ముఖ్యంగా ఈ విషయంపైనే చర్చిస్తున్నారు. అలాగే, కరోనా నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలు, తీసుకోవాల్సిన మరిన్ని అంశాలపై ఆయన మాట్లాడుతున్నారు. ఇప్పటికే పలువురు సీఎంలు లాక్డౌన్ పొడిగించాలనే మోదీని కోరారు.