మచిలీపట్నం: టీడీపీ నేత కొల్లు రవీంద్రపై వైయస్ఆర్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్నినాని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్దాలు చెబుతాడని నాని విమర్శించారు. గురువారం మాజీ మంత్రి మీడియాతో మాట్లాడారు.
పేర్ని నాని ఏమన్నారంటే..
- కొల్లు రవీంద్ర శవాల మీద పేలాలు ఏరుకునే రకం
- నిజాన్ని దాచిపెట్టి అబద్ధాలు మాట్లాడుతున్నాడు
- తాను చేయని పనులను కూడా చేశామని చెప్పుకోవడం సిగ్గులేనితనానికి నిదర్శనం
- ప్రస్తుతం ఎన్నికల కోడ్లో ఉన్నాం
- అధికారులతో సమీక్షలు చేసి మాట్లాడి తాగునీటి సమస్యను పరిష్కరించే అవకాశం లేదు
- కృష్ణా నదిలో , శ్రీశైలం ప్రాజెక్ట్లో నీరులేకపోవడం, పులిచింతల నుండి నీటిని వాడుకుంటున్నాం
- ప్రస్తుతం 4.5 టీఎంసీ తాగు నీటిని కృష్ణ, గుంటూరు, ప్రకాశం వాడుకోవాలి
- సెప్టెంబర్, ఆగస్టు ప్రాంతాలలో గోదావరి, కృష్ణా నదులలో వరద వచ్చే అవకాశం ఉంది
- అప్పటివరకు ఈ 4.5 టీఎంసీ నీటినే జాగ్రత్తగా వాడుకోవాలి
- గతంలో ఎప్పుడూ ఇలా ఇబ్బంది రాలేదు
- తరకటూరు , పంపుల చెరువు లోతు 12 అడుగులు.... 5.2 మీటర్లు స్టోరేజ్ ను పెడతారు
- నీరిచ్చిన ప్రతి రోజూ 100 గ్రామాలకు గాను 7 సెంటి మీటర్లు లోతు నీటి సాంద్రత తగ్గుతుంది
- పొలిటికల్ నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు
- అధికారులు ఎవ్వరూ ఇప్పటి వరకు వేసవిలో నీరు ఇస్తామని చెప్పే పరిస్థితి లేదు
- ముందు చూపు లేనిది ఎవరికి.. కొల్లు రవీంద్ర ఏమైనా పనొడా
- కొల్లు రవీంద్రకు ఛాలెంజ్ చేస్తున్నా
- ప్రస్తుతం 9 అడుగుల నీరు నిల్వ వుంది చూసుకో
- టీడీపీ సమయంలో రోజూ నీరిచ్చామని దగాకోరు మాటలు మాట్లాడుతున్నాడు
- 2018 లో మురికి నీరుకు జనం అల్లాడిపోయారు
- కొల్లు రవీంద్రా...అప్పుడు మేము ధర్నా చేశాం
- అప్పుడు తమరు పచ్చరంగు నీరు సప్లై చేస్తున్నందుకు ధ్వజమెత్తిన పేర్ని అంటూ విలేకరులు మీ సొంత పత్రికలలో రాశారు
- కొల్లు రవీంద్ర ముందు చూపు గురించి మాకు తెలియదా
- పేర్ని నాని వచ్చిన తరవాత ఎవరైనా బోర్లు వేశారా ... నీటి కోసం ఇబ్బంది పడ్డారా
- కొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడు