శ్రీకాకుళం: గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనే ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ధ్యేయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాళింగ కార్పొరేషన్ చైర్మన్ పేరాడ తిలక్ అన్నారు. గురువారం దేవలభద్రలో సీసీ రోడ్ నిర్మాణానికి ఎంపీపి నడుపూరు శ్రీరామమూర్తి తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈసందర్బంగా తిలక్ మాట్లాడుతూ.. గ్రామాల్లో తాగునీరు, రహదారులు, డ్రైనేజీ నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కురమాన బాలకృష్ణారావు, వైయస్ఆర్సీపీ నాయకులు చిన్ని జోగరావు, సువ్వారి వసంత్, ఎంపీటీసీలు సర్లన బైరాగి, నడుపూరు పాపారావు, అంబోడి విష్ణు, సర్పంచులు చింతాడ శ్రీను, బొంగి మోహనరావు, బొంగి హనుమ్మతురావు, కణితి నారాయణ మూర్తి, తమిరె దేవేంద్ర, బొమ్మాళి గున్నయ్య, తమిరె ఫాల్గుణరావు యవ నాయకులు కొప్పుల దనుష్, జీరు లక్ష్మణరావు, దేవేంద్ర, తదితరులు పాల్గొన్నారు.