న్యుమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ డ్రైవ్ ప్రారంభం
25 Aug, 2021 14:19 IST
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో న్యుమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ (పీసీవీ) డ్రైవ్ను వైద్య, ఆరోగ్య శాఖ ప్రారంభించింది. నెలల చిన్నారికి సీఎం వైయస్ జగన్ సమక్షంలో పీసీవీ వ్యాక్సిన్ వేశారు. పిల్లలలో న్యుమోనియా మరణాల నివారణకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వైద్య, ఆరోగ్య శాఖ చేపట్టింది. ఇప్పటివరకూ పిల్లలకు 9 రకాల వ్యాక్సిన్లు ఇస్తున్న ప్రభుత్వం, కొత్తగా న్యుమోకోకల్తో కలిపి మొత్తంగా 10 రకాల వ్యాక్సిన్లను చిన్నారులకు ఇవ్వనుంది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.