కాకినాడ: కాకినాడ జెఎన్టీయూ ప్రాంగణంలో భారతీయ విదేశీ వాణిజ్య సంస్థను కేంద్ర ఆర్థిక మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్ ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, అప్పలరాజు, వేణుగోపాలకృష్ణ, కారుమూరి నాగేశ్వరరావు, ఎంపీలు వంగా గీతా, మార్గాని భరత్, సుభాష్ చంద్రబోస్, తదితరులు పాల్గొన్నారు. మోదీ ప్రధాని అయ్యాక భారత ఎకానమీని గాడిన పెట్టారని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ అన్నారు.