తాడేపల్లి: నూజివీడు మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య, ఆయన కుమారుడు చిన్నం చైతన్య వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య, ఆయన కుమారుడు చిన్నం చైతన్య వైయస్ఆర్ సీపీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో తుని వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దాడిశెట్టి రాజా, వైయస్ఆర్ సీపీ ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి కారుమూరి సునీల్, మైలవరం వైయస్ఆర్ సీపీ నేత జ్యేష్ట శ్రీనాథ్ పాల్గొన్నారు.