రేపు ‘నివర్’ పరిహారం, రైతు భరోసా సాయం విడుదల
28 Dec, 2020 17:59 IST
తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ రైతులకు సంక్రాంతి పండుగ ముందే వచ్చింది. అసెంబ్లీలో చెప్పిన మాట ప్రకారం.. నివర్ తుపాన్ బాధిత రైతులకు పంటనష్ట పరిహారాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి రేపు విడుదల చేయనున్నారు. అదే విధంగా వైయస్ఆర్ రైతు భరోసా మూడో విడత సాయం కూడా రైతులకు చెల్లించనున్నారు. నివర్ పరిహారంతో వైయస్ఆర్ రైతు భరోసా సాయాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లోకి సీఎం వైయస్ జగన్ బదిలీ చేయనున్నారు. రైతు భరోసా మూడో విడత సాయంగా రూ.1,120 కోట్లను 51.59 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. అదే విధంగా నివర్ తుపాన్ కారణంగా 12.01 లక్షల ఎకరాల్లో పంట నష్టపోయిన రైతులకు రూ.646 కోట్ల పరిహారాన్ని బాధిత రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు. చరిత్రలో ఎన్నడూ లేనంత వేగంగా తుపాన్ బాధితులకు సీఎం వైయస్ జగన్ పరిహారం అందిస్తున్నారు.