సీఎం వైయస్ జగన్ను కలిసిన ఆదిత్యనాథ్ దాస్
23 Dec, 2020 11:25 IST
తాడేపల్లి: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ఆదిత్యనాథ్ దాస్.. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిపి పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆదిత్యనాథ్ దాస్ వెంట డీజీపీ గౌతం సవాంగ్ ఉన్నారు. ప్రస్తుత సీఎస్ నీలం సాహ్ని ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు. అదే రోజు నూతన సీఎస్గా ఆదిత్యనాథ్ దాస్ బాధ్యతలు చేపట్టనున్నారు.