అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డిని నెదర్లాండ్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం అసెంబ్లీలోని ముఖ్యమంత్రి ఛాంబర్లో వైయస్ జగన్తో వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ వారితో రాష్ట్రంలోని వివిధ రంగాలలో పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు.