సీఎం వైయస్ జగన్తో నీతిఆయోగ్ వైస్ చైర్మన్ భేటీ
13 Sep, 2019 12:22 IST
అమరావతి: నీతిఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి, సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, వ్యవసాయశాఖ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆర్థికలోటు, కేంద్రం నుంచి రావాల్సిన పారిశ్రామిక రాయితీలు, నిధుల విషయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్, సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం రాజీవ్ కుమార్ కు నివేదికలు సమర్పించారు.