తాడేపల్లి: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆరవ నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం ప్రారంభమైంది. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మోదీ సమావేశంలో పాల్గొంటున్నారు. వివిధ రాష్ట్రాల సీఎంలతో ఆయన చర్చిస్తున్నారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం వైయస్ జగన్ మాట్లాడారు. కేంద్ర మంత్రులు రాజ్నాథ్, అమిత్షా, తోమర్లు కూడా సమావేశంలో పాల్గొన్నారు.