వైయస్ జగన్ను కలిసిన నంద్యాల విద్యార్థిని షేక్ ఇష్రత్
తాడేపల్లి: వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్ను నంద్యాలకు చెందిన విద్యార్ధిని షేక్ ఇష్రత్ కలిశారు. షేక్ ఇష్రత్ ఎస్ఎస్సీ- 2025లో 600 మార్కులకు 599 మార్కులు సాధించి రాష్ట్రస్ధాయిలో రెండో ర్యాంకు సాధించింది. ఈ మేరకు ఇష్రత్ ను వైయస్ జగన్ అభినందించి, రూ. లక్ష ప్రోత్సాహకం ప్రకటించారు. ప్రతి మహిళా చదువుకున్నప్పుడే సమాజంలో జరుగుతున్న సంఘటనలపై అవగాహన వస్తుందని, ఉన్నత లక్ష్యంతో చదువుకోవాలని సూచించారు. చదువు వల్ల సమాజంలో గౌరవం లభిస్తుందని, భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. వైయస్ జగన్ ను కలిసిన వారిలో ఇష్రత్ తల్లిదండ్రులు భాను, ఎస్.ఎం.రఫి, వైయస్ఆర్సీపీ మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ ఖాదర్ బాషా, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.ఎ.హఫీజ్ ఖాన్, ఎమ్మెల్సీ రుహుల్లా, వైయస్ఆర్సీపీ నాయకులు నూరీ ఫాతిమా, షేక్ ఆసిఫ్, తదితరులు ఉన్నారు.