డ‌ప్పు క‌ళాకారుల‌ను వైయ‌స్ఆర్‌సీపీ ఆద‌రిస్తోంది

3 Aug, 2021 17:10 IST

చిత్తూరు: డప్పు కళాకారులు అందరికీ డప్పులను అందించి.. వైయ‌స్సార్‌సీపీ ప్రభుత్వం కళాకారులను ఆదరిస్తుంది అని ఎమ్మెల్యే ఆర్కే రోజా తెలిపారు. కులవృత్తులను, కళాకారులను ఆదుకోవడం కోసం వైయ‌స్ జగన్ సర్కార్ ఎప్పుడూ ముందువరుసలో ఉంటుందని పేర్కొన్నారు. మంగ‌ళ‌వారం డప్పు కళాకారులకు ఎమ్మెల్యే రోజా పరికరాల పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆమె  డప్పు కొట్టి సందడి చేశారు. అదిరిపోయేలా డప్పుపై దరువేసి అందరిలో జోష్ నింపారు.