రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు వైయస్ఆర్సీపీ ఎంపీటీసీల ఫిర్యాదు
25 Mar, 2025 21:40 IST

విజయవాడ: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నికి ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఐదు మండలాల ఎంపిటీసిలు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్తో కలిసి ఎంపీటీసీలు ఎన్నికల కమిషనర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈనెల 27 వ తేదిన జరగనున్న ఎంపిపి, వైస్ ఎంపిపి ఎన్నికలు సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్సీపీ నేతలు కోరారు. అనంతరం ఎమ్మెల్యే చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడారు.
ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఏమన్నారంటే..
- ఎర్రగొండపాలెంలోని మూడు మండలాల్లోని ఒక ఎంపీటీసి ఒక వైస్ ఎంపీపీ, ఒక కో ఆప్షన్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది
- ఈనెల 27న ఎన్నికలు జరగనున్నాయి
- త్రిపురాంతకం మండలంలో 18కి 18 మంది ఎంపీటీసీలు వైయస్ఆర్సీపీ వారే
- ఒప్పందం ప్రకారం రెండున్నరేళ్లపాటు ఇద్దరికి ఇచ్చాం
- ఒప్పందం ప్రకారం సుబ్బారెడ్డి దిగిపోయారు
- ఆయన స్థానంలో ఆళ్ల అంజిరెడ్డికి కేటాయించాం
- కుట్రలతో ఆళ్ల అంజిరెడ్డి స్థానాన్ని దక్కించుకోవాలని కూటమి నేతలు చూస్తున్నారు
- ఆళ్ల అంజిరెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు
- కూటమి నేతల స్క్రిప్ట్ తో కేసులు నమోదు చేశారు
- నిస్సిగ్గుగా వైయస్ఆర్సీపీ వారిని భయపెట్టి దక్కించుకోవాలని చూస్తున్నారు
- ఒక్క స్థానం బలం కూడా లేకుండా కూటమి గెలవాలని చూస్తోంది
- చంద్రబాబును సూటిగా ప్రశ్నిస్తున్నాం
- ఒక్క ఎంపీపీని కూడా గెలవలేరా... ఒక్క ఎంపీటీసీని కూడా గెలవలేరా
- నిజంగా రాజ్యాంగం పై నమ్మకముంటే ఏడాది తర్వాత వచ్చే ఎన్నికల్లో గెలవొచ్చుగా
- మీకు ధైర్యం లేదు కాబట్టే అక్రమ మార్గంలో గెలవాలని చూస్తున్నారు
- మీకు ప్రజాబలం లేదు కాబట్టే ఈ తరహా తప్పుడు విధానాన్ని ఎంచుకున్నారు
- ఏవిధంగా ఇక్కడ గెలవాలని చూస్తున్నారు
- ఓసీ నాయకుల పై ఎస్సీలను ప్రయోగిస్తున్నారు
- చంద్రబాబు చేస్తున్న ఎన్నికల విధానాన్ని అందరూ ఖండించాలి
- ఎన్నికల కోసం వక్రమార్గాన్ని ఎంచుకోవడం దుర్మార్గం
- ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవాలి
- ఎంపీపీ వైస్ ఎంపీపీ ఎన్నికలను నిఘా మధ్యలో జరపాలని కోరుతున్నా
- ఎర్రగొండపాలెంలో జరుగుతున్న ఈ అరాచకాన్ని ఆపాలని కోరుతున్నాం
- ఈ విధంగానే ఎన్నికలు జరిపేందుకే నోటిఫికేషన్ ఇచ్చారా
- రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరిపే ధైర్యం లేదా మీకు
- ఎన్నికల్లో స్థానిక పోలీసులు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు
- ఏ పోలీసు ఎవరిని బెదిరించారో మాదగ్గర ఆధారాలున్నాయ్
- ఆధారాలన్నింటినీ ఎన్నికల కమిషనర్ కు ఇచ్చాం
- కూటమి కుట్రలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు