అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం వీరు కలిసి వైయస్ జగన్కు ధన్యవాదాలు తెలిపారు. పార్లమెంటరీ పార్టీ నేతగా విజయసాయి రెడ్డి, లోక్ సభ పక్ష నేతగా మిథున్ రెడ్డి ఎన్నికైన సందర్భంగా సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలని సీఎం ఎంపీలకు సూచించారు.