తాడేపల్లి: చిరునవ్వుతో భరోసా ఇచ్చే సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఉండటం రాష్ట్రం అదృష్టమని వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలో 1500పడకల కరోనా ఆసుపత్రిని యుద్ధ ప్రాతిపాదికన ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.పచ్చ తమ్ముళ్లు గూగూల్లో వెతికి ఇంకెక్కడైనా ఇంత వేగంగా , సకల సౌకర్యాలతో తాత్కాలిక ఆసుపత్రి తయారు అయ్యిందోమో చూడాలని సవాలు విసిరారు.ఈ కష్టకాలంలో చిరునవ్వుతో భరోసా ఇచ్చే సీఎం ఉండటం రాష్ట్ర ప్రజల అదృష్టమని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.