ఓ మోసగాడు కులం మద్దతుతో పాత్రికేయుడిగా అవతారం
తాడేపల్లి: తనపై అసత్య ఆరోపణలు చేయడమే కాకుండా ధర్నా చేయాలని పిలుపునిచ్చిన వంశీ తీరును వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ఎండగట్టారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
ఓనమాలు రాయలేని, పొట్టపొడిస్తే అక్షరం ముక్క రాని, జర్నలిస్ట్ అనికూడా సరిగా పలకలేని ఓ మోసగాడు కులం మద్దతుతో బ్లాక్ మెయిలర్ గా, పాత్రికేయుడు గా అవతారమెత్తి ధర్నా చేయాలనీ పిలుపు ఇస్తే పదిమంది జర్నలిస్టులు కూడా వెళ్ళలేదు. వీడు నన్ను ఆంధ్రకు రాకుండా అడ్డుకుంటాడట. అసలు హైదరాబాద్ లో నీ ఆఫీస్/స్టూడియో ఉంటుందో ఊడుతుందో చూసుకోరా, టాల్కమ్ పౌడర్ డబ్బా..అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
నేరాలు, ఘోరాలపై ఓ శ్వేతపత్రం విడుదల చేయ్యొచ్చు కదా?
రాష్ట్రంలో ఈ మధ్య నలబై రోజులుగా జరుగుతున్న నేరాలు, ఘోరాలకు కూటమి ప్రభుత్వం లో పెద్దలు ఎందుకు మౌనంగా ఉన్నారు, వీటిపై కూడా ఒక శ్వేతపత్రం విడుదల చెయ్యొచ్చు కదా! అంటూ విజయసాయిరెడ్డి మరో ట్వీట్ చేశారు.
అధికారం ఇస్తే 24 గంటల్లో న్యాయం అన్నారు, సుగాలి ప్రీతి ఏమైంది? చిత్తూరు జిల్లా మైనర్ బాలిక హత్య కేసు ఏమైంది? మీరు రాష్ట్రంలో రావణకాష్టాన్ని నిరాటంకంగా కొనసాగిస్తూ, కుల వివక్షతతో మా పార్టీ కార్యకర్తల్ని వారి కుటుంబాల్ని గ్రామాల నుంచి వెళ్లగొట్టి హింసిస్తూ దాని దృష్టి మళ్లించడానికి ఎందుకీ యాతన! అంటూ నారా లోకేష్ను ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.
విద్యారంగం దారి తప్పింది. పాలకులు మాట తప్పుతున్నారు. స్కాలర్ షిప్ లు రాలేదు, హాస్టల్స్ లేవు, అక్రమ బదిలీలు జరుగుతున్నాయి, విద్యా రంగం పై తగినంత సమయం కేటాయించలేకపోతున్నారు, ముందు దాని మీద దృష్టి పెట్టండి! అంటూ నారా లోకేష్కు విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా చురకలంటించారు.