తస్మాత్ జాగ్రత్త
23 Mar, 2020 11:33 IST
తాడేపల్లి: కరోనా వైరస్ నిర్మూలనతో పాటు ఎల్లో వైరస్ వ్యాప్తిని కూడా నియంత్రించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఎల్లో మీడియా తుమ్ములు, దగ్గులతో పచ్చ వైరస్ వదులుతూనే ఉందని వ్యాఖ్యానించారు. అధికార పీఠం నుంచి తరిమివేసినా చంద్రబాబు బ్యాచ్ తమ మీడియాను అడ్డం పెట్టుకొని ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడానికి చూస్తుందన్నారు. ఇలాంటి వారితో తస్మాత్ జాగ్రత్త అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.