అమరావతి: ఇప్పటి దాకా దోచుకున్నది చాలదా చంద్రబాబూ? అని వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపి విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. భూముల ధరల స్పెక్యులేటివ్ బూమ్ ను నిజం చేసుకోవడానికి ఇన్ని డ్రామాలు అవసరమా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని వికేంద్రీకరణ వద్దని చెప్పడానికి జోలె పట్టుకుని వసూళ్ల యాత్రలు అవసరమా? 8 నెలల్లోనే ఇంత పతనమయ్యావేమి బాబూ?' అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
'పొరుగు రాష్ట్రాల్లోని తెలుగువారంతా సొంత గ్రామాలకు వచ్చి సంక్రాంతి పండగను ఘనంగా జరుపుకున్నారని తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఊహించిన లాభాలు రావడం కష్టమని చంద్రబాబు నాయుడి కుటుంబం మాత్రమే సంబరాలకు దూరంగా ఉండి పోయిందన్నారు. పచ్చ మీడియా తప్ప బాబు పిలుపును ఎవరూ పట్టించుకోలేదు' అని విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పించారు.