బీహార్ గడ్డి కుంభకోణం కన్నా నీరు-చెట్టు స్కామ్ పెద్దది

26 Jul, 2019 10:31 IST

న్యూఢిల్లీ:  మాజీ సీఎం చంద్రబాబునాయుడి హయాంలో ఎన్నో కుంభకోణాలు జరిగాయని, విచారిస్తే అవన్నీ బయటకు వస్తాయని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అన్నారు. బీహార్ లో జరిగిన పశువుల దాణా కుంభకోణం కన్నా, నీరు-చెట్టు స్కామ్ పెద్దదని ఆరోపించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, "చంద్రబాబు గారి ప్రభుత్వంలో జరిగిన నీరు-చెట్టు కుంభకోణం బీహార్ దాణా స్కాం కంటే పెద్దది. 22 వేల కోట్ల నిధులను జన్మభూమి కమిటీలకు పంచి పెట్టారు. సమగ్ర దర్యాప్తు జరిగితే బాబు, చిన బాబు ఇంకా అనేక పెద్ద తలకాయల బండారం బయట పడుతుంది" అని అన్నారు.