తాడేపల్లి: జులై 1న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కొత్త అంబులెన్స్లు ప్రారంభిస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యద్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన ట్వీట్ చేశారు.
ప్రజారోగ్యం పట్ల సీఎం వైయస్ జగన్ తపనకు కార్యరూపంగా సరికొత్త హంగులతో 108, 104 వాహనాలు బుధవారం (జులై 1) నుంచి అందుబాటులోకి రాబోతున్నాయని పేర్కొన్నారు. 203 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన అంబులెన్సులు, మొబైల్ క్లినిక్స్లో వెంటీలేటర్లు, ఈసీజీ, లైఫ్ సపోర్టు వ్యవస్థలో అందుబాటులో ఉంటుందని చెప్పారు.
సర్కారీ వైద్య విప్లవం
వైయస్ జగన్ రాష్ట్రంలో సర్కారీ వైద్య విప్లవాన్ని తీసుకొచ్చారని మరో ట్వీట్లో విజయసాయి రెడ్డి కొనియాడారు. ఎన్నడూ లేని విధంగా కొత్తగా 16 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని తీర్మానించారని వివరించారు. కానీ ఆ తర్వాత ముఖ్యమంత్రులు ప్రైవేటును మాత్రమే ప్రోత్సహించారన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం పెద్దాయన కలలను సాకారం చేస్తోందని పేర్కొన్నారు.