విజయవాడ: రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు ప్రతిపక్ష పార్టీ కుట్రలు చేస్తుందని వైయస్ఆర్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం ఆయన ట్వీట్ చేశారు. ఎద్దుపుండు కాకికి ముద్దంటారు.ఆలయాలపై దాడులు చేస్తున్నవారిని పట్టుకునే పనిలో పోలీసులుంటే...ఎలాంటి ఘటనలూ లేకపోయినా పాతవాటిని తెరపైకి తెస్తూ కొందరు పైశాచిక ఆనందం పొందుతున్నారు. కుల మతాల మధ్య చిచ్చే పచ్చ కుల పార్టీ స్కెచ్ అని ప్రజలు పసిగట్టేశారు అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.