అలా చేస్తే.. తండ్రీకొడుకులిద్దరూ రాజకీయంగా గల్లంతవుతారు!
విశాఖ: చంద్రబాబు, నారా లోకేష్ తీరు మార్చుకోకపోతే రాజకీయంగా గల్లంతవుతారని వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ట్వీట్ చేశారు. మాలోకాన్ని అందరికీ ఆమోదయోగ్యుడిగా తీర్చిదిద్దాలంటే ప్రజలకు మేలు చేసే పనులు చేయాలి. వాళ్ల మనసులు గెలవాలి. విగ్రహాలను ధ్వంసం చేసి ప్రజల మధ్య అడ్డు గోడలు కడితే పోలీసులకు దొరికిపోతారు. తండ్రీకొడుకులిద్దరూ రాజకీయంగా గల్లంతవుతారు.
అడ్డంగా దొరికిపోయారు..
అధికారంలో లేనప్పుడు విద్వేషాలు రెచ్చగొట్టడం బాబుకు అలవాటే. గతంలో బంద్ లు, నిరసనలకు పిలుపు ఇచ్చినప్పుడల్లా ఎన్ని బస్సులు తగలబెట్టాలో జిల్లాల వారిగా టార్గెట్లిచ్చేవాడని సొంత మనుషులే బయటపెట్టారు. ఇప్పుడు ‘ఆపరేషన్ టెంపుల్స్ డిమాలిషన్’కు సేమ్ స్కెచ్ వేసి అడ్డంగా దొరికిపోయారు అంటూ విజయసాయిరెడ్డి మరో ట్వీట్ చేశారు.