తాడేపల్లి: ప్రతిపక్ష నేత చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు బుధవారం విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఉక్రెయిన్ విద్యార్థులకు జూమ్ లో చంద్రబాబు దారి చూపారట! గూగుల్ మ్యాప్స్ లో బాంబ్స్ లెక్కించారట! చైనా, ఇండియన్ అర్మీస్ కన్నా CBN ఆర్మీ పెద్దదట! టీడీపీ వెకిలి ప్రచారం చూసి జనం నవ్వుకుంటున్నారు. ఇక మీ పార్టీ ఉండేది జనంలో కాదు, జూమ్ లోనే.. అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్లో పేర్కొన్నారు.