విశాఖ: తాను మరణిస్తూ ఏడుగురికి ప్రాణదానం చేసిన తాడేపల్లికి చెందిన వైద్య విద్యార్థి అయ్యప్ప నాయుడు అందరికీ ఆదర్శప్రాయమని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన నాయుడి అవయవాలను కుటుంబసభ్యులు దానం చేశారు. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి సకాలంలో అవయవాలను తరలించిన పోలీసులకు ధన్యవాదాలు అంటూ ట్వీట్లో విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.